Header Banner

ఏపీలో రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్..! జస్ట్ స్కాన్ చేస్తే చాలు..!

  Wed Jun 04, 2025 11:37        Politics

రేషన్ కార్డుదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. జూన్ ఒకటో తేదీ నుంచి రేషన్ దుకాణాల ద్వారా రేషన్ బియ్యం పంపిణీని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది. అంతకుముందు ఎండీయూ వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేసేవారు. అయితే ఈ విధానంలో రేషన్ బియ్యం పక్కదారి పడుతోందన్న ఆరోపణల మధ్య ఏపీ ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయాలని నిర్ణయించి, ఆ మేరకు అమలు చేస్తోంది. ఆదివారం నుంచి ఈ విధానం అమల్లోకి రాగా.. తొలి రోజే రాష్ట్రంలోని 18 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుదారులు రేషన్ సరుకులు తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరోవైపు రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అలాగే రేషన్ కార్డుదారులకు ఉపయోగకరంగా ఉండేలా మరో నిర్ణయం తీసుకుంది.

ప్రతి రేషన్ షాపు వద్ద పూర్తి వివరాలతో సమాచార బోర్డును ఏర్పాటు చేస్తున్నారు. ఈ బోర్డులో సదరు రేషన్ దుకాణానికి సంబంధించిన రేషన్ డీలర్, అధికారుల వివరాలు ఉంటాయి. అలాగే ఈ బోర్డులో ఓ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుంది. రేషన్ కార్డుదారులకు ఏమైనా సమస్యలు వస్తే.. తమ సెల్‌ఫోన్‌లో స్కాన్‌ చేసి ఆ అంశం మీద అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు. ఇక లబ్ధికారుల ఫిర్యాదు మీద 24 గంటల్లోనే అధికారులు స్పందిస్తారని ప్రభుత్వం చెప్తోంది. ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే ఆ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని చెప్తున్నారు.


ఇది కూడా చదవండి: ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!


మరోవైపు ఆదివారం రాత్రి 9 గంటల వరకు ఏపీలో రేషన్ సరుకుల పంపిణీ జరిగింది. తొలిరోజు 18.87 లక్షల కుటుంబాలు రేషన్ దుకాణాల ద్వారా నిత్యావసర సరుకులు తీసుకున్నాయి. కొన్నిచోట్ల సర్వర్ సమస్యలు తలెత్తినట్లు అధికారులు తెలిపారు. మొత్తం రాష్ట్రంలోని 29,760 రేషన్ దుకాణాల ద్వారా ఉదయం 8 నుంచి రేషన్ పంపిణీ మొదలైంది. ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు రేషన్ సరుకులు అందిస్తారు. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ ఆదివారంతో సహా రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీ జరుగుతుందని ప్రభుత్వం తెలిపింది.

మినీ మాల్స్‌గా రేషన్ షాపులు

మరోవైపు రేషన్ దుకాణాలను అభివృద్ధి చేయనున్నట్లు ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్తెలిపారు. ఆదివారం పిఠాపురం నియోజకవర్గంలో రేషన్ సరుకుల పంపిణీని నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రేషన్ షాపులను అభివృద్ధి చేస్తామని.. భవిష్యత్తులో మినీ మాల్స్‌గా డెవలప్ చేస్తామని వెల్లడించారు. రేషన్ సరుకుల పంపిణీలో అవకతవకలకు అవకాశం లేకుండా రేషన్‌ దుకాణాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

అలాగే మండల్ లెవల్ స్టాక్ పాయింట్ల వద్ద ఏఐతో పనిచేసే కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేసి నిఘా ఉంచుతామన్నారు. 65 ఏళ్లు దాటిన వృద్ధులు, దివ్యాంగులు రాష్ట్రంలో 15.60 లక్షల మంది ఉన్నారన్న నాదెండ్ల మనోహర్.. వీరికి ఇంటి వద్దే రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ప్రతి నెలా ఐదో తేదీలోపు వీరిందరికీ ఇంటి వద్దే రేషన్‌ సరకులు అందిస్తామని వివరించారు.


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు

 

రిమాండ్ ఖైదీకి మరో షాక్! కోర్టు కీలక ఉత్తర్వులు!

 

పసిడి ప్రియులకు అలర్ట్.. బంగారం ధరల్లో మరోసారి మార్పులు.. ఈ రోజు తులం రేటు ఎంతుందంటే?

 

ఏపీ లిక్కర్ స్కాం కేసు నిందితులకు బిగ్ షాక్.. రిమాండ్ పొడిగింపు - జడ్జి కీలక వ్యాఖ్యలు!

 

కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

గుంటూరు జిల్లాలో పెరుగుతున్న కరోనా కేసులు... 15 పడకలతో ఐసోలేషన్ వార్డు సిద్ధం!

 

కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?

 

ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?

 

జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!

 

 పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!

 

బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!

 

'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!

 

 వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!

  

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #APRationCard #GoodNews #JustScan #SmartWelfare #DigitalServices #APGovtUpdate #PublicWelfare #RationCardBenefits